Tuesday, February 22, 2011

తెలంగాణాలో బంద్ విజయవంతం

రెండు రోజుల తెలంగాణా బంద్ తొలిరోజు విజయవంతమైంది. హైదరాబాద్ తో సహా జిల్లాల్లో వ్యాపారస్తులు, విద్యాసంస్థలు స్వచ్చందంగా తమ దుకాణాలు మూసివేశారు. రాజధాని హైదరాబాద్ లో రోడ్లన్నీ ఖాలిగా కనిపించాయి. ఆర్.టి.సి. రవాణా పూర్తిగా స్థంబించిపోయింది.ప్రభుత్వ ఉద్యోగుల సహాయనిరాకరణకు తెలంగాణా బంద్ తోడవడంతో జనజీవనం ఎక్కడికక్కడ ఆగి పోయింది. ఉస్మానియా క్యాంపస్ లో పోలీసులకు, విద్యార్థులకు మద్య రాళ్ళ వర్షం, జే.ఎ.సి. నేత కోదండరాం, టి.ఆర్.ఎస్ నేత హరీష్ రావు అరెస్టులతో నగరం దద్దరిల్లింది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చుసిన పోలీసులే కనిపించారు. ఉస్మానియా, నిజాం కాలేజీలను పోలీసులు చుట్టుముట్టి, నిజాం కాలేజీ విద్యార్థులపై భాష్ప వాయువు ప్రయోగించారు. ఈ బంద్ తెలుగుసినిమా పరిశ్రమ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమా థియేటర్లు, స్టూడియోలు, ల్యాబ్లు అన్ని స్వచ్చందంగా బంద్ పాటించారు. నలభై ఎనిమిది గంటల బంద్ లో మొదటి రోజు విజయవంతమైంది.

No comments: