Monday, March 7, 2011

సినిమాలు లేని రాంచరణ్

సినిమాలు లేని రాంచరణ్
తెలుగు సినిమా స్టార్స్ అందరూ వరుసగా సినిమాలు చేస్తుంటే మెగాస్టార్ తనయుడు రాంచరణ్ కెరీర్ ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మగధీర హిట్ తరువాత ఆరెంజ్ లాంటి అత్తర్ ఫ్లాప్ సినిమాను చేసి ఆయన అభిమానులను, నిర్మాత, సినిమాను కొనుక్కున్న వారిని పూర్తిగా నిరాశ పరిచారు. మెరుపు సినిమా కూడా మధ్యలోనే ఆగిపోవడంతో చరణ్ కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. ఎవరితో సినిమా చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మెరుపు సినిమా ఆగిపోవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్న చరణ్ ఆచి, తూచి సినిమాలు చేసేలా కనిపిస్తున్నాడు. ఆరెంజ్ సినిమా విడుదలై ఇంతకాలం అవుతున్న ఫలానా సినిమా చేస్తున్నట్లు చరణ్ తరఫునుంచి అధికారిక ప్రకటన రాలేదు. కెరీర్ జాగ్రతగా వృద్ధి లోకి తీసుకురాడానికి ప్రస్తుతం నలుగురు దర్శకులతో చరణ్ కథ చర్చలు జరుపుతున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారనే పుకార్లు ఫిలింనగర్ లో షికార్లు చేస్తున్నాయి. వి.వి.వినాయక, త్రివిక్రమ్ శ్రీనివాస్, లారెన్స్ లతో కథ చర్చలు జరుగుతున్నాయి. మరి చరణ్ బాబు ఎవరితో సినిమా చేస్తాడో వేచి చూడాల్సిందే.

No comments: