Thursday, March 17, 2011

టి.వి.ల్లో మార్పులు

తెలుగు న్యూస్ చానల్స్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ మారిపోతారో తెలియదు. ఎక్కువ జీతం వస్తుందని ఒకరు, డెస్క్ లో బాధలు భరించలేక ఇంకొకరు, ఇలా రకరకాల కారణాలతో ఈ మధ్య ఒక టి.వి. నుంచి మరో టివికి మారడం ఓ సంస్కృతిగా మారిపోతోంది. ఎ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి లో బ్యూరో చీప్ గా పనిచేసిన మూర్తి మానేశారు. ఆ స్థానంలో రాజ్ న్యూస్ లో ఉన్న జాకీర్ చేర్యారు. టివి9 నుంచి రాజ్ న్యూస్ కు వచ్చిన జాకీర్ కొంత కాలం మాత్రమే రాజ్ న్యూస్ లో పనిచేశారు. అంతేకాదు మొన్నటివరకు ఖాలిగా ఉన్న రామచందర్ రావు ప్రత్యెక ప్రతినిధి గా ఎబిఎన్ లో చేరారు. ఇటీవలే టివి5 లో చేరిన లక్ష్మి నారాయణ మల్లి ఎన్ టి.వి. పంచాన చేరారు. న్యూస్ చానల్ లో పనిచేయడం చేతకాకనో, వినోద భరిత చానల్ లో ఊపెద్దమనో గాని స్టూడియో ఎన్ నుంచి బయటికి వచ్చిన నాగు కొద్ది రోజులు జీ తెలుగు లో చేరుతున్నట్లు తెగ ప్రచారం చేసుకున్నాడు. తమ్మారెడ్డి భరద్వాజ , లగడపాటి శ్రీధర్ లాంటి ప్రముఖులచే రికమన్ డేసన్ చేయించినా పాపం పప్పులు ఉడకలేదు. తరువాత జ్ఞానోదయం అయినట్లుంది వచ్చి మల్లి న్యూస్ చానల్ ఎ.బి.ఎన్.ఆంధ్రజ్యోతి లో చేరాడు.

No comments: